మంచిని నమ్మి చెడినవారు లేరంటారు.ఓ సూపర్ పవర్ ఉందని నమ్మడమే భక్తి.అది సన్మార్గానికే దిక్సూచి అవుతుంది గానీ ఏ చెడుపు చేయదు.అయితే మేలే గానీ ఎంతమాత్రం కీడు జరగదనేది సనాతన ధర్మంగా ఇప్పటికీ భాసిల్లుతోంది.అందుకే అనాదిగా హిందువుల్లో అనేకానేక విశ్వాసాలు ఇంకా చలామణిలో ఉన్నాయి.వాటిల్లో ఒకటి ఈ శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయం.ఈ ఆలయంలోని శివలింగాన్ని నమ్మిన భక్తులు తమ నుదుటితో తాకితే అదో మెత్తటి దూది పింజెను స్పృశించిన అనుభూతి కల్గడం విశేషం.దేశంలో గల 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శ్రీశైలం రెండో అతి పురాతన విశిష్టక్షేత్రం.ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లాలోని నల్లమల గిరుల్లో సాక్షాత్తూ పరమశివుడు కొలువుదీరాడని అత్యధిక హిందువుల విశ్వాసం.అందువల్లనే రాష్ట్రంలో తిరుమల తర్వాత అంతటి పుణ్యక్షేత్రంగా భక్తుల మన్ననల్ని ఈ శ్రీశైలం క్షేత్రం పొందుతోంది.కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉందీ పుణ్యస్థలం.హైదరాబాద్కు దక్షిణం వైపు 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించి శ్రీశైలం చేరుకోవచ్చు.ఆదిశంకరాచార్యులు ఇక్కడ మల్లికార్జునుణ్ని దర్శించాకే శివానందలహరిని రచించారు.ఈ ఆలయంలో కొలువైన మల్లికార్జునుడు శివుని ప్రతిరూపం కాగా భ్రమరాంబ సాక్షాత్తూ పార్వతీదేవి స్వరూపం.

చ..మీ విస్తీర్ణంలో గల శ్రీశైలం అభయారణ్యం పులులు, చిరుతలు, ఎలుగు, హైనా, లేళ్లు, అడవి పిల్లులు తదితర వన్యప్రాణులతో అలరారుతోంది.ఈ డ్యాం జలాల్లో వివిధ రకాల మొసళ్లు మనుగడ సాగిస్తుంటాయట.గుంటూరు,హైదరాబాద్ల నుంచి విస్తారంగా బస్సులు నడుస్తుంటాయి. మార్కాపూర్, కర్నూల్, గుంటూరుల నుంచి అనేక రైళ్లు తిరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి విమాన సౌకర్యం కూడా ఉంది.

No comments:
Post a Comment