(you can see other posts from this blog, go threw with mozilla firefox/google chrome)
లోకో భిన్నరుచి!..ఆ రుచినీ ప్రకృతిని ఆస్వాదిస్తూ స్వీకరిస్తుంటే భలే మజా.అందుకు భూమి,ఆకాశం,నీటిపైనే కాదు సముద్రగర్భం కూడా వేదిక అయిందంటే ఆశ్చర్యంతోపాటు వింత అనుభూతినే కల్గిస్తుంది.సరిగ్గా అలాంటి థ్రిల్ను మనకు కల్పించే రెస్టారెంటే ప్రకృతి అందాలకు పర్యాయపదమైన మాల్దీవుల్లో ఉంది.2007లో మాల్దీవుల్లోని(రంగలిఐలాండ్)హిందూ మహాసముద్ర జలాల అడుగున నిర్మితమైన హిల్టన్ మాల్దీవ్స్ రిసార్ట్ అండ్ స్పాకు చెందిన ఇథా ప్రపంచంలోనే తొలి రెస్టారెంట్గా చరిత్రను లిఖించడమే కాక అలరిస్తోంది.అలల ఉధృతి లేని ప్రశాంత సముద్ర జలాల్లో ఒదిగి ఉన్న ఈ అద్దాల((అక్రిలిక్)హోటల్లో చూడ చక్కని చేపలు అసాంతం కదలాడుతుండగా ఊహల్లో తేలిపోతూ విందు ఆరగించడం ఎవరికైనా మరపురాని మధుర జ్ఞాపకమే.ఈ రెస్టారెంట్కు వచ్చే అతిథులు 270 డిగ్రీల కోణంలో సముద్ర గర్భాన నెలకొన్న అందాలను కన్నుల పండగ్గా తిలకిస్తుంటారని హిల్టన్ జనరల్ మేనేజర్ కార్స్టన్ షైక్ పేర్కొన్నారు.న్యూజిలాండ్కు చెందిన ఎంజె మర్ఫీ లిమిటెడ్ ఈ హోటల్ను రూపుదిద్దింది.సాధారణంగా అక్వెరియాల్లో తిరుగాడే రంగురంగుల చేపలనే మనం సంభ్రమంగా చూస్తుంటాం.ఈ హోటల్కెళ్తే మనమే అక్వెరియంలో ఉండగా చుట్టూ పరుచుకున్న సముద్ర జలాల్లో సంచరించే చేపల మధ్య ఇష్టమైన రుచులను ఆస్వాదించడమన్నది కచ్చితంగా సరికొత్త అనుభూతే.దాదాపు ప్రపంచ ప్రఖ్యాత వంటకాలన్నీ ఈ రెస్టారెంట్లో లభ్యమౌతాయి.అయితే మాల్దీవుల ప్రాంత జలాల్లో మాత్రమే దొరికే వైట్ ఫిష్,ఫెన్నెల్(ఓ రకం మొక్క)సాస్,కూర ఈ హిల్టన్ రెస్టారెంట్ స్పెషల్.ఈ హోటల్లో నుంచి తాబేళ్లు,వివిధ రకాల చేపలు,మొక్కలు,అనేక జలచరాల సహా షార్క్లను చూడ్డం అతిథుల్లో క్షణక్షణం అనంత ఉత్కంఠనే కల్గిస్తూంటుంది.

______________________________________________________________
సిడ్నీ@100:వందో టెస్టుకు ఆతిథ్యం ఇస్తోన్న సిడ్నీ గ్రౌండ్లోనే భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 100@100...
No comments:
Post a Comment